నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం అందుకుంది. నిత్యా మేనన్ రవి మోహన్తో కలిసి కాదలిక్క నెరమిల్లై సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటోంది. తనకు సినిమా రంగం అంటే ఏమాత్రం ఇష్టం లేదంటూ బాంబు పేల్చింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. తనకు మరో రంగంలో అవకాశం వస్తే ఇప్పటికిప్పుడే వెళ్లిపోతానని చెప్పింది. ఓ నటిగా ఉన్నందున స్వేచ్ఛగా జీవించడాన్ని మరిచిపోయినట్లు అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా నిత్యామేనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. చివరగా కొలాంబి సినిమాలో నటించిన నిత్యా.. ఇడ్లీ కడై, డియర్ ఎక్సెస్తో పాటు వీజేఎస్ ఫిల్మ్లో హీరోయిన్గా నటిస్తోంది. నిత్యా తెలుగులో చివరిసారిగా బీమ్లా నాయక్లో కనిపించింది.