సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా హాలులోకి వచ్చిన సందర్భంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పటికే జైలు నుండి విడుదలైన సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని.. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నాడు. ఆ కుటుంబానికి మరోసారి నా క్షమాపణలతో పాటు సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నాడు.

- December 18, 2024
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor