యాక్టర్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఈ మూవీని సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతోందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ విషయమేంటంటే.. బన్నీ అభిమానులు వైజాగ్లోని సంగం శరత్ థియేటర్లో అల్లు అర్జున్ భారీ కటౌట్ను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 16×108 అడుగుల కటౌట్ను నిర్మిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్దది కావడం విశేషం. భారీ కటౌట్తో సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటుండగా.. ఆ కటౌట్ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- November 22, 2024
0
50
Less than a minute
You can share this post!
editor