ఆ సీన్స్ తొలగించండి అంటూ కోర్టు మెట్లెక్కిన నటి రమ్య

ఆ సీన్స్ తొలగించండి అంటూ కోర్టు మెట్లెక్కిన నటి రమ్య

అభిమన్యు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ యాక్టర్ రమ్య. 2023లో రిలీజైన కన్నడ కామెడీ డ్రామా. తన అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించిన సీన్లను తొలగించాలని నిర్మాతలను కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మాజీ మైసూరు ఎంపీ తాజాగా కోర్టును ఆశ్రయించింది. ట్రైలర్‌తోపాటు సినిమాలోని పుటేజీలో కొన్ని సన్నివేశాలను తన అనుమతి తీసుకోకుండా వాడారని రమ్య ఫిర్యాదులో పేర్కొంది. నిర్మాతలు తన అనుమతి లేకుండా వాడిన  వీడియోలను తొలగించడమే కాకుండా.. తనకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై నిర్మాతలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తాను నటించిన సీన్లు తొలగించడం కానీ, ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేదని, తన మాటలను అసలు పట్టించుకోవడం లేదని రమ్య  ఆరోపించింది. సినిమాలోని తన సన్నివేశాలను తొలగిస్తే కేసును వెనక్కి తీసుకుంటానని కూడా రమ్య చెప్పినట్టు ఒక టాక్ ఉంది. మరి రమ్య వ్యవహరంపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది.

editor

Related Articles