ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇమాన్వి కథానాయిక. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా వినికిడి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రభాస్ ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇమాన్వి కథానాయిక. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, హీరో హీరోయిన్లపై కొన్ని కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారని తెలిసింది. దేశభక్తి ప్రధానంగా చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ప్రభాస్ పాత్రను నవ్యరీతిలో ఆవిష్కరిస్తూ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాని రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

- November 20, 2024
0
104
Less than a minute
Tags:
You can share this post!
administrator