హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా ఐశ్యర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రియురాలిగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా వస్తున్న ట్రయాగింల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమాకి ‘సక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ని ఖరారు చేశారు. సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేష్ లుంగీ ధరించి.. గంభీరమైన భంగిమలో, స్పోర్టింగ్ షేడ్స్, తుపాకీ పట్టుకుని.. ఐశ్వర్య రాజేష్ చీరలో.. మీనాక్షి చౌదరి మోడ్రన్ అవతార్లో కనిపించారు. మూవీ డబ్బింగ్ పనులు మొదలవగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

- November 1, 2024
0
94
Less than a minute
Tags:
You can share this post!
administrator