ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య

కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి భార్య ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. “ఎన్టీఆర్ మా అన్నయ్య” అంటూ ఆమె స్పీచ్‌లో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిష‌బ్ శెట్టి హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా కాంతార చాప్ట‌ర్‌ 1. ఈ అక్టోబ‌ర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్లలో రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో హీరో, మేక‌ర్స్‌, సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బెంగ‌ళూరు, ముంబైల‌లో ప్ర‌త్యేక ఈవెంట్లు నిర్వ‌హించిన చిత్ర బృందం తాజాగా హైద‌రాబాద్‌లో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హ‌జ‌రయ్యారు. కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు ఆయన భార్య ప్ర‌గ‌తి శెట్టి కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.. హైదరాబాద్‌లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ప్రసంగం అందరినీ కట్టిపడేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ మా అన్నయ్యలాంటి వారు. తెలుగు ప్రేక్షకుల నుండి మాకు ఎప్పుడూ అపారమైన ప్రేమ లభిస్తోంది. ఆ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ రోజు మా సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ తెలుగు ఆడియ‌న్స్ మా ఫ్యామిలీలో భాగం అంటూ భావోద్వేగంగా చెప్పారు.

editor

Related Articles