సినీ తారలు ఒక్కొక్కరిగా సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాను సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకోబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే అనుష్క ప్రకటించిన కొద్ది గంటల్లోనే తాజాగా మరో నటి సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు తెలిపింది. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి తాజాగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి తాను మొదట్లో అనుకున్నానని.. కానీ కాలంతో పాటు మనము కూడా అప్ డేట్ అవ్వాలన్న ఆలోచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఐశ్వర్య తెలిపింది. అంతేగాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. తాను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటి తెలిపింది. ఈ సందర్భంగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. నేను నా పనిపైన, పరిశోధనలపైన దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా నన్ను పక్కదారి పట్టించింది. సోషల్ మీడియా వలన నాలోని క్రియేటివిటీ దెబ్బతింది. నాలో నెగిటివిటీని పెంచడమే కాకుండా ఒక సర్కిల్లో లాక్ అయ్యేలా చేసింది. నాకు నేను ఏదో ఒక సూపర్ పవర్ గా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక మహిళగా, నేను చాలా కష్టపడి నాకు నేనుగా మారిపోయాను, కానీ సోషల్ మీడియాకి లొంగిపోవడానికి నేను ఇష్టపడలేదు. ప్రపంచం నన్ను మర్చిపోతుందనే రిస్కుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని కళాకారిణిని, నాలో ఉన్న చిన్న పాపని కాపాడుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంటర్నెట్ నుండి పూర్తిగా అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో మరింత అర్థవంతమైన బంధాలను, మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నేను నిజంగా మంచి సినిమా చేస్తే, మీరు పాత పద్ధతిలోనే ప్రేమను షేర్ చేస్తారని ఆశిస్తున్నానంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

- September 13, 2025
0
27
Less than a minute
You can share this post!
editor