ఇటు సినిమాలు, మరో పక్క ఐటమ్ సాంగ్స్, ఇంకో పక్క వెబ్ సిరీస్.. ఖాళీగా కూర్చోకుండా ఏది దొరికితే అది ఓకే చేస్తున్న హీరోయిన్ తమన్నా ఒక్కరేనేమో అనిపిస్తోంది! ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో కొందరు ఇప్పటికే ఇంటికి తిరుగు ప్రయాణం కట్టారు, కానీ ఈమె తన గ్లామర్ను కాపాడుకుంటూ ఇండస్ట్రీలో చాలా తెలివిగా కొనసాగుతున్నారు తమన్నా. ‘స్త్రీ 2’ సినిమాలో ఆమె చేసిన ‘ఆజ్ కీ రాత్’ పాట జనాన్ని ఊపేసింది. దీనివల్ల ‘వాన్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలాగే ‘రాగిణి ఎంఎంఎస్’ మూడో ఫ్రాంఛైజీలో తమన్నా నటించనున్నారన్నది తాజా సమాచారం. హర్రర్ కథాంశంతో ‘రాగిణి ఎంఎంఎస్’ సినిమా తొలిసారిగా 2011లో వచ్చింది. 2014లో సెకండ్ పార్ట్ ప్రేక్షకులను పలకరించింది. అందులో సన్నీలియోన్ నటించింది. ఆ సినిమాకు మూడో భాగం తీయాలనే ఆలోచన ఇప్పుడు ఏక్తాకపూర్కు రావడంతో తమన్నాను సంప్రదించారు. ఈ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్లో నటించడానికి తమన్నా కూడా ఆసక్తి చూపించడంతో ఏక్తా ముందడుగు వేశారు. ఈ ఏడాది చివర్లో ‘రాగిణి ఎంఎంఎస్ 3’ సినిమా సెట్స్పైకి రానున్నది. దర్శకుడు ఎవరు, తారాగణం వివరాలు త్వరలో తెలియజేస్తాము.

- August 23, 2025
0
114
Less than a minute
You can share this post!
editor