Movie Muzz

‘అడుగు అడుగునా..’ గీతం రిలీజ్ చేసన సివి ఆనంద్

‘అడుగు అడుగునా..’ గీతం రిలీజ్ చేసన సివి ఆనంద్

రోహిత్‌ సాహిని, గౌతమ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మిస్టీరియస్‌’. మహీ కోమటిరెడ్డి దర్శకుడు. జయ్‌ వల్లందాస్‌ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. చిత్రబృందం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘అడుగు అడుగునా..’ అంటూ సాగే ఈ సినిమాలోని ఓ సందేశాత్మక గీతాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఎం.ఎల్‌.రాజా ఈ గీతాన్ని రాసి, స్వరపరచగా, ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ ఆలపించారు. పోలీసుల నిబద్ధతను తెలియజేసేలా ఈ పాట సాగింది.

administrator

Related Articles