టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసుల అరంగేట్రం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి రెండు ప్రముఖ కుటుంబాల నుండి ఆసక్తికరమైన కొత్త జోడీ సినీ ఎంట్రీకి రాబోతున్నారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సీనియర్ నటుడు రమేష్ బాబు కూతురు భారతి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుండగా, ఆమెకి జోడీగా దర్శకుడు తేజ కుమారుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఇద్దరూ నటించే సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. యూత్ను ఆకట్టుకునే కంటెంట్తో, భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఈ జంటపై ఇప్పటికే సోషల్ మీడియాలోను, సాధారణ ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. భారతి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పాటకి కుర్చీ మడతపెట్టికి చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఆమె లుక్, గ్రేస్ చూసిన నెటిజన్లు “ఈమె డెఫినిట్గా హీరోయిన్ అవుతుందని” కామెంట్లు పెట్టారు. ఇక దర్శకుడు తేజ కుమారుడు బాలనటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించినా, ఈ సినిమా ద్వారా ఫుల్లెంగ్త్ హీరోగా తొలి అడుగులు వేయనున్నాడు. ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించేది ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు కాని, తేజ స్వయంగా ఈ సినిమా పర్యవేక్షించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.