హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. నేడు విచారణకు రావాలని విజయ్కి నోటీసులు జారీ చేయగా.. తాజాగా అతడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ యాప్ల ప్రమోషన్ల ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
- August 6, 2025
0
113
Less than a minute
Tags:
You can share this post!
editor


