నిర్మాత రెడీ – ఇక హీరో యాక్షన్‌ షురూ..

నిర్మాత రెడీ – ఇక హీరో యాక్షన్‌ షురూ..

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ ఓ సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జులై మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జెబి మోహన్‌ పిక్చర్స్‌ భాగస్వామ్యంలో పూరి కనెక్ట్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నది. ‘దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా నవ్యరీతిలో ఆవిష్కరించబోతున్నాడు. వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సంయుక్త, టబు, విజయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సమర్పణ: ఛార్మి, నిర్మాత, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌, మరో నిర్మాత – జెబి నారాయణరావు కొండ్రోల్లా.

editor

Related Articles