తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోల సరసన ఆమె నటించిన సినిమాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. 1987, ఆగస్టు 5న జన్మించిన జెనీలియా, ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో బాలీవుడ్కు పరిచయమయ్యారు. ఇందులో హీరోగా రితేష్ దేశ్ముఖ్ నటించారు. మొదటి సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ చాలాకాలం కొనసాగి, 2012లో ఇరు కుటుంబాల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ‘బాయ్స్’ సినిమాతో అరంగేట్రం చేసిన జెనీలియా, ‘బొమ్మరిల్లు’, ‘సాంబ’, ‘ఆరెంజ్’, ‘నా అల్లుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె చేసిన పాత్రలు ఎంతో సహజంగా ఉండటంతో అభిమానులు జెనీలియాని తెలుగింటి అమ్మాయిగా భావించారు. ఇక జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా, ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంది. ఇక తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందం, ఆకర్షణలో ఆమె ఇప్పటికీ అప్సరసే అన్నంతగా మెరిసిపోతోంది. ఈ ఏజ్లో కూడా జెనీలియా ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తోంది అంటూ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
- July 1, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor

