దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, మహేష్బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అలానే తమిళంలో కూడా విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయే సరికి తమిళంలో ఎక్కువగా నటిస్తోంది. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో హిట్స్ అందుకుంది. థగ్ లైఫ్ సినిమాతో పలకరించింది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ టాలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. మహేష్బాబు సరసన అతడు, సైనికుడు సినిమాల్లో నటించింది త్రిష. ఈ సినిమాల్లో త్రిష నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు మంచి ఇంపాక్ట్ కలిగించాయి. త్రిషకు మహేష్బాబుతో పరిచయం సినిమాలలోకి రాకముందే ఏర్పడిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇద్దరూ చెన్నైలో చదువు పూర్తిచేసిన సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై స్నేహితులయ్యారట. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. “మహేష్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకు సెట్లో ఉంటారు. రాత్రి 10.30 వరకు షూటింగ్లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఆయనను చూస్తే నేను తక్కువగా పనిచేస్తున్నట్టు గిల్టీగా ఫీలవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు అని పేర్కొంది. ఆయనతో పనిచేసే అనుభవం ఒక పాఠం మాదిరిగానే ఉంటుందని త్రిష పేర్కొంది.

- June 25, 2025
0
73
Less than a minute
Tags:
You can share this post!
editor