కుబేర రెండో సింగిల్ సాంగ్ రిలీజ్

కుబేర రెండో సింగిల్ సాంగ్ రిలీజ్

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ‘కుబేర’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాల్ని చర్చిస్తూ సందేశాత్మక కథతో దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మంగళవారం సినిమాలోని ‘అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ..’ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్నందించారు. సమాజంలోని ఆర్థిక అంతరాలు, అవినీతి వంటి అంశాలను చర్చిస్తూ లోతైన భావాలతో ఈ పాట సాగింది. హైదే కార్తీ, కరీముల్లా ఆలపించిన ఈ పాటలో ధనుష్‌, నాగార్జున పర్‌ఫార్మెన్స్‌ ఎమోషనల్‌గా సాగింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు.

editor

Related Articles