‘షష్టిపూర్తి’ సినిమా ఈ నెల 30న రిలీజ్

‘షష్టిపూర్తి’ సినిమా ఈ నెల 30న రిలీజ్

డా.రాజేంద్రప్రసాద్‌, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్‌, ఆకాంక్షసింగ్‌ జంటగా.. పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘షష్టిపూర్తి’. రూపేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఇళయరాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం మూడో పాటను విడుదల చేశారు. ‘రాత్రంతా రచ్చే.. మరి నువ్వంటే పిచ్చే.. నీమాటే నచ్చే.. మది మరుమల్లై విచ్చే..’ అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్‌ రాయగా యువన్‌ శంకర్‌రాజా, నిత్యశ్రీ ఆలపించారు. ఈ సందర్భంగా యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ ‘మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు ఆనందంగా ఉంది. తెలుగులో నేను పాడిన తొలి పాట ఇది. ఇది చాలా కూల్‌ సాంగ్‌. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. యువన్‌ ఈ పాటను అద్భుతంగా పాడారని, ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలు ఒక ఎత్తైతే.. ఈ పాట మరో ఎత్తని, ఫుల్‌ రొమాంటిక్‌ జోష్‌లో ఈ పాట ఉంటుందని, కళాదర్శకుడు తోట తరణి ఈ పాట కోసం నాలుగు సెట్లు వేశారని దర్శక, నిర్మాతలు తెలిపారు.

editor

Related Articles