కోలీవుడ్ హీరో రజినీకాంత్ ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ సినిమా “కూలీ” పట్ల ఏ రేంజ్ హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమా తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో భారీ సీక్వెల్ జైలర్ పార్ట్ 2 ని రజినీకాంత్ చేయనున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ఈ సినిమాకి రజినీకాంత్ అందుకుంటున్న భారీ రెమ్యూనరేషన్ పై ఒక చర్చ నడుస్తోంది. దీని ప్రకారం తలైవర్ జైలర్ 2 కోసం ఏకంగా 260 కోట్లు తీసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్గా కూడా రజినీకాంత్ రెమ్యూనరేషన్ పెద్ద రికార్డని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా శివరాజ్ కుమార్, మోహన్లాల్ సహా మరింతమంది స్టార్స్ కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్కి తీసుకురానున్నారు.
- May 8, 2025
0
74
Less than a minute
Tags:
You can share this post!
editor

