పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే పవన్ హుటాహుటిన సింగపూర్ వెళ్లి అక్కడి డాక్టర్లతోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ వచ్చారు. త్వరగానే కోలుకున్న మార్క్ శంకర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో పాటు నల్ల పొగ పీల్చడం వలన వైద్యులు తగు ట్రీట్మెంట్ అందించారు. ఇప్పుడు చాలా బెటర్, బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్మెంట్ని మార్క్ శంకర్కి అందించినట్టు తెలుస్తోంది. ఇంకా మార్క్ శంకర్ పూర్తిగా కోలుకోలేదు కాబట్టి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సింగపూర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
- April 12, 2025
0
127
Less than a minute
You can share this post!
administrator


