సీనియర్ నటి కస్తూరికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన ఆమెకు ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమెకు నవంబర్ 29 వరకూ రిమాండ్ విధించారు. కానీ ఆమె బెయిల్ కోరుతూ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు స్పెషల్ చైల్డ్ ఉందని, సింగిల్ మదర్నని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. బిడ్డను తానే చూసుకోవాలని తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఆమె అభ్యర్థనను మన్నించిన కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.

- November 21, 2024
0
156
Less than a minute
You can share this post!
editor