విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్! ‘కింగ్డమ్’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. దిల్రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరెకెక్కనుంది. మాస్ యాక్షన్, రూరల్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ప్రారంభ వేడుక శనివారం హైదరాబాద్లో సైలెంట్గా జరిగింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు నెలకొన్నాయి. “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..” అనే పంచ్ లైన్తో, కత్తి పట్టుకున్న రక్తంతో తడిసిన చేయి ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇప్పటికే విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో నడవనుందని విజయ్ గతంలో వెల్లడించాడు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్కి సినిమా యూనిట్ అంతా హాజరవగా, అక్కడ నుండి లీకైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రత్యేకంగా ఈ ఈవెంట్కి కీర్తి సురేష్ హాజరుకావడం, ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అని గట్టి సంకేతాలు ఇస్తోంది. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఉండనుందని రూమర్లు రాగా, ఇప్పుడు ఈ పిక్తో క్లారిటీ వచ్చేసింది ఫ్యాన్స్లో అని అంటున్నారు.
- October 11, 2025
0
126
Less than a minute
You can share this post!
editor

