సోషల్ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటీ పెరిగిపోయింది. ఎక్కువ శాతం గాలివార్తలే ఉండటం చేత, నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేదు. రీసెంట్గా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. ‘పుష్ప 2’ హిట్ అవ్వడంతో ‘పుష్ప3’ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘పుష్ప2’ ఎండింగ్లో ‘పుష్ప 3-ర్యాంపేజ్’ అంటూ మూడో పార్ట్ని దర్శకుడు సుకుమార్ ప్రకటించేశారు. దాంతో ఇప్పుడు ‘పుష్ప 3’ గురించి ఆసక్తికరమైన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ‘పుష్ప 3’ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఉంటుందనేది ఈ వార్త సారాంశం. బాంబ్ బ్లాంస్టింగ్లో శ్రీవల్లి మినహా పుష్పరాజ్ అండ్ ఫ్యామిలీ చనిపోతారట. శ్రీవల్లికి కొడుకు విజయ్ దేవరకొండట. మూడో పార్టంతా దేవరకొండ చుట్టూనే తిరుగుతుందట. ఇందులో నిజం ఎంతుందో తెలీదు..

- December 9, 2024
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor