8 ఏళ్ల తర్వాత నటించిన ఉపేంద్ర ‘యుఐ’..

8 ఏళ్ల తర్వాత నటించిన ఉపేంద్ర ‘యుఐ’..

క‌న్న‌డ హీరో ఉపేంద్ర స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘UI’. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర‌. మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తోంది. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి వార్న‌ర్‌ పేరిటా టీజ‌ర్‌ను షేర్ చేశారు. ఈ టీజ‌ర్ చూస్తుంటే.. ‘UI’ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌లో ఈ సినిమా స్టోరీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ్లోబ‌ల్ వార్మింగ్, ఏఐ, క‌రోనా, ఆర్థిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధాలతో ముగిసిన అనంత‌రం 2040లో భూమి ఎలా ఉండ‌బోతుంది.. ప్ర‌జ‌లు ఎలా జీవిస్తున్నారు. భూమిని కాపిటలిస్ట్‌లు తమ గుప్పిట్లో ఎలా పెట్టుకుని నాశ‌నం చేశారు అనేది ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ‘UI’ వ‌ర‌ల్డ్‌లో ఉపేంద్ర ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌గా క‌నిపించ‌బోతున్నాడు. మ‌రోవైపు ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న తెలుగుతో పాటు, క‌న్న‌డ‌, మ‌లయాళం, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

editor

Related Articles