‘మహావతార్ నరసింహ’పై UP Govt. ప్రశంసలు

‘మహావతార్ నరసింహ’పై UP Govt. ప్రశంసలు

హిందూ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో యానిమేటెడ్ సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘మహావతార్ నరసింహ’. క‌న్నడ టాప్ బ్యాన‌ర్ హోంబలే ఫిల్మ్స్ నుండి వ‌చ్చిన ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్ర‌శంస‌లు కురిపించింది. మహావతార్ నరసింహ – సినిమాను తెర‌కెక్కించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను కాపాడటానికి చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నమే  అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్ర‌శంస‌లు కురిపించింది. ఈ సినిమా జులై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ సినిమా విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటిది. ఈ సినిమాను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు.

editor

Related Articles