పుష్ప 2′ వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించిన బన్నీ, చివరికి డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్తో సైలెంట్గా సెట్స్పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్తో సంబంధం లేకపోయినప్పటికీ, బన్నీకి సన్నిహితుడైన నిర్మాత బన్నీవాసు ఈ సినిమా నిర్మాణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా బన్నీ వాసు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ సినీ వర్కర్స్ సమ్మె కారణంగా చిత్రబృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రతిరోజు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ సినిమాకి ఈ తరహా కార్మికుల సమ్మె కారణంగా బ్రేక్స్ ఎంతో నష్టాన్ని కలిగించాయి. విదేశాల నుండి వచ్చిన టెక్నీషియన్లకు పనిలేకున్నా రోజువారీగా పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది,” అన్నారు. “ఇది సన్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కావడంతో, వారితో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ఏదైనా సమాచారం బయటపెట్టాలంటే వారు అనుమతించాలి. అందుకే మేమంతా ఇప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది,” అని చెప్పారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ వంటి హాలీవుడ్ బిగ్బడ్జెట్ సినిమాలకు పనిచేసిన ఓ ప్రముఖ టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకి పనిచేస్తోంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి త్వరలోనే అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని అంచనా. ఇక ‘పుష్ప 2’ హైప్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో బన్నీ ఫ్యాన్స్కి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

- August 26, 2025
0
78
Less than a minute
You can share this post!
editor