ముగ్గురు డియరెస్ట్ ఫ్రెండ్స్  ‘భైరవం’

ముగ్గురు డియరెస్ట్ ఫ్రెండ్స్  ‘భైరవం’

బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. అదితిశంకర్‌, ఆనంది, దివ్యాపిళ్లై హీరోయిన్లు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ గ్రామంలో వారాహి గుడి నేపథ్యంలో ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ నడిచే కథ ఇది. ఒకరికోసం ఒకరు ఎంతవరకైనా గొడవలకు వెళతారు. ఈ నేపథ్యంలో టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. చివర్లో ముగ్గురు మిత్రులు దేవుని దీవెనలు పొందుతున్నట్లుగా డివైన్‌ ఎలిమెంట్‌తో టీజర్‌ను ముగించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మంచి కథాబలమున్న సినిమా ఇదని, అందరికీ గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. సాయిశ్రీనివాస్‌, రోహిత్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని మంచు మనోజ్‌ తెలిపారు. ఈ సినిమాలో తనను సరికొత్త పాత్రలో చూస్తారని నారా రోహిత్‌ పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్‌, విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా ఉంటాయని, త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని నిర్మాత కేకే రాధామోహన్‌ పేర్కొన్నారు.

editor

Related Articles