బెల్లకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అదితిశంకర్, ఆనంది, దివ్యాపిళ్లై హీరోయిన్లు. సోమవారం టీజర్ను విడుదల చేశారు. ఓ గ్రామంలో వారాహి గుడి నేపథ్యంలో ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ నడిచే కథ ఇది. ఒకరికోసం ఒకరు ఎంతవరకైనా గొడవలకు వెళతారు. ఈ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. చివర్లో ముగ్గురు మిత్రులు దేవుని దీవెనలు పొందుతున్నట్లుగా డివైన్ ఎలిమెంట్తో టీజర్ను ముగించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కథాబలమున్న సినిమా ఇదని, అందరికీ గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. సాయిశ్రీనివాస్, రోహిత్తో కలిసి నటించడం ఆనందంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ఈ సినిమాలో తనను సరికొత్త పాత్రలో చూస్తారని నారా రోహిత్ పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్, విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత కేకే రాధామోహన్ పేర్కొన్నారు.

- January 21, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor