సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘తెలుసు కదా’. నీజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదలకానుంది. సోమవారం ‘మల్లిక గంధ..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. తమన్ స్వర రచనలో సిధ్శ్రీరామ్ ఆలపించారు. ‘ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండి ఏదో మారిందా.. ఎంతెంత చూస్తున్నా.. ఇంకాస్త లోతుందా’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది.
- July 29, 2025
0
101
Less than a minute
Tags:
You can share this post!
administrator


