టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయపై కొందరు యువకులు అసభ్యకరమైన కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కపురంలోని ఓ షాపింగ్మాల్ ఓపెనింగ్కి వెళ్లిన అనసూయపై కొందరు ఆకతాయిలు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో అనసూయ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబసభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే మీరు ఊరుకుంటారా. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో పెద్దవాళ్లు నేర్పలేదా అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.
- August 2, 2025
0
225
Less than a minute
Tags:
You can share this post!
administrator

