నటభూషణ శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి అనేక రికార్డులను సృష్టించింది. పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తర్వాత శోభన్ బాబు ‘సోగ్గాడు’గా ప్రసిద్ధి చెందారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ ప్రధాన నటీనటీనిగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం, నాటి ప్రేక్షకులను ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం, ఈ ఏడాది అదే రోజున 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19న హైదరాబాద్లో ఘన స్వర్ణోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్వర్ణోత్సవ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రముఖ సినీ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, శోభన్ బాబుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
- December 11, 2025
0
47
Less than a minute
You can share this post!
editor


