తమిళ హీరో శింబుకి పాటలు పాడటంలో కూడా ప్రాక్టీస్ ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఆయన ఇప్పటికే తనదైన శైలిలో సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన పవన్కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఓ పాట పాడారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓజీ’ సినిమాలో శింబు పాట పాడనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా తమన్ ప్రకటనతో అది నిజమని రుజువైంది. ‘ఫైర్ స్ట్రామ్’ పేరుతో కంపోజ్ చేసిన ఈ పాటకు శింబు వాయిస్ హైలెట్గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ‘ఓజీ’ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైన తర్వాత ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్దాస్, ప్రకాష్రాజ్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా కొంతభాగం చిత్రీకరణ మిగిలి వుంది. రాజకీయ కార్యకలాపాలకు కాస్త గేప్ ఇచ్చి త్వరలో ఈ సినిమా షూటింగ్లో పవన్కళ్యాణ్ పాల్గొనే అవకాశాలున్నాయని తెలిసింది.

- April 17, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor