సమంతకు ఇష్టమైన ఈషా ఫౌండేషన్‌కు పయనం

సమంతకు ఇష్టమైన ఈషా ఫౌండేషన్‌కు పయనం

సమంత ప్రస్తుతం రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లారు. కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. తన తదుపరి సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ‘శుభం’ చిత్రంతో మాయ మాతశ్రీగా కామియో చేసి మెప్పించారు సమంత. ఆ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరించి విజయం సాధించారు. ఈ సినిమా సక్సెస్‌తో తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మువింగ్‌ పిక్చర్స్‌లో వరుసగా కథా బలమైన సినిమాలు తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశగా కథలు వింటూ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఆమె తనకెంతో ఇష్టమైన ఈషా ఫౌండేషన్‌కు వెళ్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘మళ్లీ ఆ సమయం వచ్చింది, ప్రతి మూడు నెలలకు ఓసారి నేను నిశ్శబ్ధంలోకి వెళ్తాను. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. నాకు పవిత్రమైన స్థలమిది. ఈ ఆనంద నిలయం నాకు రెండో ఇల్లు లాంటిది. కష్టంలో, ఎత్తుపల్లాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఊరట కలిగించింది. ఇదే నాకు ఆనంద నిలయం’ అని సమంత ఈషా ఫౌండేషన్‌ గురించి చెప్పుకొచ్చారు.

editor

Related Articles