జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, “మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది” అని చెప్పింది. రష్మిక కామెంట్స్ విన్న జగపతి బాబు చప్పట్లు కొట్టి “మంచిమాట చెప్పావమ్మా” అంటూ రష్మికను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ, నెటిజన్లలో చర్చకు దారితీస్తోంది.
- November 5, 2025
0
139
Less than a minute
You can share this post!
administrator


