మిస్టర్ మజ్ను ఫేమ్ నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ లోనూ చాన్స్ కొట్టేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ “పవన్ కల్యాణ్ దయ కలిగిన వారు, లెజెండ్, ఆయన కళ్లు పవర్ ఫుల్ అంటూ పొగిడారు. ఈ సినిమాలో తను పంచమిగా పలు కోణాలు ఆవిష్కరించే పాత్రలో మన ముందుకు వస్తుందని, వీర – పంచమి ప్రేమకథ చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ఇక ప్రభాస్తో నటించడం ఆనందంగా ఉంది. ఆయన్ని అందరు డార్లింగ్ అని ఎందుకు అంటారో ఈ సినిమాతో తెలిసింది” అని అన్నారు.

- December 4, 2024
0
116
Less than a minute
You can share this post!
editor