117 మంది వాయిద్య కళాకారులతో తమన్…

117 మంది వాయిద్య కళాకారులతో తమన్…

తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ ఓజి సినిమా గురించి ఓ మ్యూజికల్‌ అప్ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకి కొత్త టెక్నాలజీ ఇన్ స్ట్రుమెంట్ ను ఉపయోగించారు. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌ ప్రారంభించారు. వరుస అప్ డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్లు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ ఓ మ్యూజికల్‌ అప్ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకి కొత్త టెక్నాలజీ ఇన్ స్ట్రుమెంట్ ను ఉపయోగించారు. జపాన్‌ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి బీజీఎం క్రియేట్‌ చేసినట్లు తమన్‌ వెల్లడించారు. తాజాగా మరో పో స్ట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచారు. లండన్ లోని స్టూడియోలో ఈ సినిమా రికార్డింగ్‌ పనులు జరుగుతున్నట్లు తమన్‌ తెలిపారు. 117 మంది సంగీత కళాకారులు దీనికోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.  బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా వచ్చింది. సాహో తర్వాత సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపొందుతోంది. పవన్‌ కళ్యాణ్ ను ఇప్పటివరకూ చూడని పాత్రలో చూడబోతున్నామని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులో ఆయన ఓజాస్‌ గంభీర అనే గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించారు. ఇమ్రాన్‌ హష్మీ విలన్. శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్‌, అర్జున్ దాస్‌ తదితరులు కీలక పాత్రధారులు.

editor

Related Articles