హీరోయిన్ ఓరియెంటెడ్గా ఓ సినిమా వస్తోందంటే ఎవరూ ఎంకరేజ్ చేయరు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలతో పాటు ఒక్కోసారి ప్రేక్షకులు కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా లేరని పిస్తుంది. అది ఎంత మంచి సినిమా అయినా సరే. దీనిని నేను తప్పు పట్టను. అది వాస్తవం కూడా. ఈ సినిమా ద్వారా ఆ వాస్తవాన్ని తెలుసుకున్నా అన్నారు అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ‘పరదా’ సినిమా ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా నుండి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అనే థీమ్సాంగ్ను విడుదల చేశారు. గొప్ప కంటెంట్తో ఈ సినిమా తెరకెక్కిందని, ఇందులో డ్యాన్స్, ఫైట్స్ ఏమీ లేకపోయినా హృదయాన్ని కదిలించే ఉద్వేగాలుంటాయని, నేటి సమాజంలో స్త్రీసాధికారత, స్వాభిమాన అవశ్యకతకు అద్దం పడుతుందని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. స్త్రీల తాలూకు సామాజిక సమస్యను చర్చిస్తూ ఈ సినిమాని తీశానని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల చెప్పారు.

- July 18, 2025
0
139
Less than a minute
Tags:
You can share this post!
editor