93 వసంతాలు పూర్తి చేసుకున్న పద్మశ్రీ షావుకారు జానకి

93 వసంతాలు పూర్తి చేసుకున్న పద్మశ్రీ షావుకారు జానకి

అలనాటి అందాల తార, పద్మశ్రీ షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజిఆర్, శివాజీ గణేశన్ మొదలైన అగ్ర నటుల సరసన కథానాయికగా నటించారు. నలుగురు సీఎంలతో నటించిన ఖ్యాతిని గడించారామె.

93 ఏళ్ల జానకి, 1931 సంవత్సరం డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టి.వెంకోజీరావు, తల్లి సచీదేవి. మద్రాసులోని ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్‌గా  14 ఏళ్లకే పనిచేశారు. అదే సమయంలో కొన్ని నాటకాల్లోనూ యాక్ట్ చేశారు. సీనియర్ నటుడు ఎన్టీఆర్  సరసన 18 ఏళ్ల వయసులో ‘షావుకారు’ అనే సినిమాలో సుబ్బులు రోల్‌లో నటించారు ఆమె. తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టి, ఈ మూవీ పేరు ఆమె ఇంటి పేరుగా మార్చుకున్నారు. జానకి చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు.

             తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేశారు జానకి. తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుతో 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వయసు మీద పడినా 93 ఏళ్లు దాటినా షావుకారు జానకి నటన మానడం లేదు. ఇప్పటికీ తన అభిరుచికి తగ్గ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు జానకి.

editor

Related Articles