తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా చిత్రం ప్రారంభం

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా చిత్రం ప్రారంభం

లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ **‘ప్రీ వెడ్డింగ్ షో’**తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 2గా వస్తోంది. తమ తొలి ప్రొడక్షన్ **‘శివమ్ భజే’**తో ప్రేక్షకులను అలరించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తిరువీర్, మసూద నుంచి ప్రీ వెడ్డింగ్ షో వరకు వేర్వేరు జానర్లలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా కూడా ప్రేక్షకులకు ఒక వైవిధ్యమైన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి.

editor

Related Articles