తప్పు మీద తప్పు చేస్తున్న కీర్తి సురేష్‌..

తప్పు మీద తప్పు చేస్తున్న కీర్తి సురేష్‌..

సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు, కలలతో వచ్చేవారు చాలామంది ఉంటారు. ఒకటి రెండు హిట్లు రావడం సరే… కానీ ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవడమే నిజమైన సవాలు. ఒకసారి మనం అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోయినా ప‌ర్లేదు, కానీ ఉన్నపేరు కూడా దెబ్బతింటే, మళ్లీ మునుపటిలా ఎదగడం అసాధ్యమే. ఈ తరహా పరిస్థితులను ఇప్పుడు కీర్తి సురేష్ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. 2018లో వచ్చిన మహానటి సినిమాతో ఆమె సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. సావిత్రిగా చేసిన ఆమె అభినయం, నటన‌కు విమర్శకులు, ప్రేక్షకుల నుండి అపారమైన ప్రశంసలు వచ్చాయి. అదే సినిమా ఆమెకు జాతీయ పురస్కారాన్ని కూడా తీసుకొచ్చింది.
అయితే ఆ తరువాత ఆమె కెరీర్ గమనం త‌గ్గుతూ వ‌చ్చింది. కొన్ని మంచి సినిమాలు చేసినా, “మహానటి” స్థాయి హిట్ మాత్రం రాలేదు. “దసరా” వంటి సినిమాలతో మెప్పించినా, వాటి తర్వాత ఆమె కెరీర్ మరింత బలపడేలా మారలేదు. ఇప్పుడు తాజాగా తమిళ పరిశ్రమలో కీర్తి చేయబోతున్న ఒక కొత్త సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక కొత్త దర్శకుడు చేయబోతున్న సినిమాగా సినీ వర్గాల్లో చెబుతున్నారు. ఇందులో కీర్తితో పాటు మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. “ఇలాంటి కథలు ఎంచుకోవ‌డం, కొత్త దర్శకులతో పనిచేయడం ఆమె స్థాయికి సరిపోయేదేనా?” అన్న చర్చ సాగుతోంది.

editor

Related Articles