మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, మధుర జ్ఞాపకాలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం పిల్లలతోపాటు నమ్రత, గౌతమ్, సితారా న్యూయార్క్ టూర్లో ఉన్నారు. అక్కడి పాప్ సింగర్ లేడీ గాగా షోకు హాజరయ్యారు. ఆ షోలో కుటుంబం ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు నమ్రతా. స్టేజ్ పై లేడీ గాగా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్. బయట కుటుంబంతో దిగిన సెల్ఫీలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ షో పట్ల తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. ‘ఒకే పదంలో చెప్పాలంటే.. ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. లేడీ గాగా, యూ ఆర్ రాక్ స్టార్. నీ షోలో ప్రతి క్షణం ఒక జ్ఞాపకం, అమోఘం అనిపించాయి. ఎంతో ప్రేమతో’ అని రాశారు.

- September 9, 2025
0
38
Less than a minute
You can share this post!
editor