మహేష్‌బాబు హీరోయిన్‌కి రక్తంతో లవ్ లెటర్ వచ్చిన వైనం..

మహేష్‌బాబు హీరోయిన్‌కి రక్తంతో లవ్ లెటర్ వచ్చిన వైనం..

ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్‌కి సక్సెస్ తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ వారిని అంతలా భయపెడతారు. బాలీవుడ్ నటి అమృతా రావు కూడా అలాంటి భయంకరమైన ఘటనలను చూసినట్లు చెప్పుకొచ్చింది. ఒక సినిమా సక్సెస్ అయితే.. నన్ను పెళ్లి చేసుకో.. నన్ను ప్రేమించు అంటూ వెంటపడే అబ్బాయిలు కోకొల్లలు. ఇది అందరి హీరోయిన్స్ జీవితంలో జరిగేదే. అయితే అమృతా రావుకు కొద్దిగా ఎక్కువ జరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అమృతా రావు.. వివాహ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 2006 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్నోహిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో అమృతా తెలుగులో మరోసారి కనిపించలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. తాజాగా ఆమె అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్‌బి 3లో ఆమె నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అమృతా.. వివాహ్ సక్సెస్ తరువాత తనకు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి చెప్పుకొచ్చింది. అందులో ఒక వ్యక్తి తనకు రక్తంతో రాసిన లవ్ లెటర్ పంపాడని, అది చూసి తాను భయపడినట్లు చెప్పుకొచ్చింది.

editor

Related Articles