బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం సిద్ధమైంది. అయితే ప్రతి సీజన్లో కూడా కొత్తదనం చూపించేందుకు ట్రై చేసే బిగ్ బాస్ టీం, ఈ సారి ప్రేక్షకుల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్త కాన్సెప్ట్ని తీసుకువచ్చింది. అదే “అగ్నిపరీక్ష”. ఇప్పటికే 18 వేల మందికి పైగా సామాన్యుల నుండి దరఖాస్తులు వచ్చాయి. వారి నుండి కేవలం 42 మందిని సెలెక్ట్ చేశారు. అయితే… అసలు ట్విస్టు ఏంటంటే.. ఈ 42 మందిలో చివరికి కేవలం ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎంట్రీ ఉంటుంది.
ఈ ఐదుగురు ఎవరనే దాన్ని తేల్చే కీలక బాధ్యత మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో మైలురాళ్లుగా నిలిచిన ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ చేతుల్లో ఉంది. వారే అభిజిత్, బిందు మాధవి, నవదీప్. గత నాలుగు రోజులుగా అగ్నిపరీక్ష షూటింగ్ జరుగుతుండగా, ఆ సిరీస్కు సంబంధించి ఒక చిన్న వీడియో లీక్ కావడం, వెంటనే అధికారిక ప్రోమో రిలీజ్ కావడం ఈ కాన్సెప్ట్పై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఇదే మీ స్పాట్లైట్. ఇదే మీ ఎంట్రీ టికెట్. కానీ ఇది అంత తేలిక కాదు,’’ అంటూ వార్నింగ్ ఇస్తోంది.