విబేధాల‌తో అత‌న్ని దూరం పెట్టాను..: అనుప‌మ‌

విబేధాల‌తో అత‌న్ని దూరం పెట్టాను..: అనుప‌మ‌

మ‌ల‌యాళ హీరోయిన్ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోను సినిమాలు చేస్తూ అల‌రిస్తోంది. రీసెంట్‌గా కిష్కింధపురి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన ‘కిష్కింధపురి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్ సక్సెస్‌ను నమోదు చేసింది. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీగా ఆదరించారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా చేరిపోయింది.

సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన ‘కిష్కింధపురి’ సక్సెస్ మీట్‌లో అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ, తన జీవితంలోని ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించగా, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం మనస్పర్థల వల్ల అతనితో మాట్లాడటం మానేశాను. ఆ తర్వాత‌ అతను పంపిన మెసేజ్‌లకు స్పందించలేదు. రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడన్న వార్త విని షాక్ అయ్యాను. మనతో ఉన్న వారితో తక్కువగానైనా మాట్లాడాలి లేకపోతే జీవితాంతం బాధే మిగిలిపోతుంది అంటూ అనుపమ భావోద్వేగానికి లోనయ్యారు.

editor

Related Articles