‘బాయ్స్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హాసిని బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. ‘సత్యం’, ‘సై’, ‘హ్యాపీ’ వంటి సినిమాలలో నటనపరంగా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ‘ఢీ’, ‘రెడీ’, ‘కొత్త బంగారు లోకం’ వంటి హిట్ సినిమాలలో నటించిన జెనీలియా, తన కెరీర్ పీక్లో ఉండగానే సినిమాలకు గుడ్బై చెప్పేసి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు వైవాహిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం ‘జూనియర్’ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి నుండి నేను ప్రాధాన్యత ఉన్న పాత్రలకే సైన్ చేస్తాను. ఇండస్ట్రీలోకి రావడం బొమ్మరిల్లులో హాసినిగా, హ్యాపీలో మధుమతిగా పాత్రలు చేయడం, ప్రేక్షకుల నుండి విశేషమైనటువంటి ఫ్యాన్స్ను పొందడం నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఇక టాలీవుడ్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్, బన్నీ నా ఫ్రెండ్స్. ఇప్పుడు వారిని సూపర్ స్టార్స్గా చూస్తుంటే చాలా ఆనందం వేస్తోంది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మూడు పేజీల డైలాగ్ కూడా ఒకేసారి చెప్పేస్తాడు. అలాంటి నటుడిని ఇంతవరకు చూడలేదు. ఇక రామ్చరణ్ కూడా అద్భుతమైన నటుడు అని ప్రశంసించిన జెనీలియా.. ఇక అల్లు అర్జున్లో మంచి ఎనర్జీ ఉందని స్పష్టం చేసింది. మరో మంచి లవ్ స్టోరీ సినిమా కుదిరితే చేయాలని ఉంది అని చెప్పింది జెనీలియా.

- July 16, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor