కొత్త లుక్‌తో నవంబర్ 21న మీ ముందుకు..?

కొత్త లుక్‌తో నవంబర్ 21న మీ ముందుకు..?

త్రినాధ్ కఠారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ నవంబర్ 21న విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి “వెయ్యేళ్లూ ధర్మంగా వర్ధిల్లు” అనే ట్యాగ్‌లైన్ మంచి ఆకర్షణగా మారింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచింది. నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి విడుదల చేయనుండగా, ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాల్లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఆర్‌.పి పట్నాయక్ సంగీతం అందించగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్‌.బి ఎడిటింగ్ నిర్వహించారు. యూత్‌ఫుల్ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికగా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

editor

Related Articles