‘పోర్ తొళిల్’ ద‌ర్శ‌కుడితో ధనుష్ కొత్త సినిమా..

‘పోర్ తొళిల్’ ద‌ర్శ‌కుడితో ధనుష్ కొత్త సినిమా..

ఇటీవ‌లే ‘కుబేర’ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న త‌మిళ న‌టుడు ధ‌నుష్ మ‌రో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆయ‌న కెరీర్‌లో 54వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు D54 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌బోతోంది. ఈ సినిమాకు పోర్ తొళిల్‌ అనే థ్రిల్ల‌ర్‌తో సూప‌ర్‌హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వ‌హించ‌బోతున్నాడు. వేల్స్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఇషారి గ‌ణేష్ ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌గా.. జీవీ ప్ర‌కాష్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను చిత్రబృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో పత్తిపంట కాలిపోతుండగా ధ‌నుష్ నిల‌బ‌డి ఉన్నాడు. అతని వెనుక భయంకరమైన మంటలు అలుముకుని ఉన్నాయి. ఈ దృశ్యం సినిమా కథాంశంపై, దాని థీమ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది చాలా ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథతో రాబోతోందని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి ప్రముఖ నటులు ఇందులో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాను డా. ఇషారి కె.గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

editor

Related Articles