భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాకముందే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించగా, మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్స్ తీస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. 2016లో మరాఠీ నుండి వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా సైరట్ (Sairat). ఈ సినిమా మరాఠీలోనే దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను బాలీవుడ్లో ధడక్ పేరుతో రీమేక్ చేశారు. ఇషాన్ ఖట్టర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా హిందీలో కూడా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ధడక్ 2 అంటూ రాబోతున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, యానిమల్ భామ త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదల తేదీతో పాటు ట్రైలర్ అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం విడుదల చేయబోతుండగా.. సినిమాను ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒకప్పుడు ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు, వారి కథ ముగిసింది. అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతోంది.
- July 9, 2025
0
120
Less than a minute
Tags:
You can share this post!
editor

