బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ నటి జాన్వీకపూర్.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా ‘పరమ్ సుందరి’తో ఈ వివాదం తలెత్తింది. ఈ సినిమాలో జాన్వీ పోషించిన మలయాళీ యువతి పాత్రపై ఓ మలయాళ గాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదల కానుంది. ఇందులో జాన్వీ ఒక మలయాళీ యువతిగా కనిపించనున్నారు. లుక్, డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో జాన్వీకి మంచి ప్రశంసలు వచ్చాయి. జాన్వీ మలయాళ యాసపై నెటిజన్ల నుండి విమర్శలు మొదలయ్యాయి. జాన్వీ పాత్రపై సోషల్ మీడియాలో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ఒక మలయాళీ పాత్రకు మలయాళ నటిని ఎందుకు ఎంపిక చేయలేదు? ఒకటే సంస్కృతిని సరైన రీతిలో ప్రతిబింబించాలంటే.. అక్కడి వ్యక్తుల్ని తీసుకోవాల్సిందే కదా!’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా జాన్వీ మాట్లాడిన మలయాళ యాసను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే, జాన్వీ అభిమానులు తీవ్రంగా స్పందించారు. పవిత్ర మీనన్పై మండిపడ్డారు. ఆమె వీడియోను పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయగా.. ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోను తొలగించింది.

- August 22, 2025
0
176
Less than a minute
You can share this post!
editor