హీరో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ సాంగ్ను షూట్ చేయాల్సి ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో చిరంజీవి గతంలో తాను నటించిన ఓ సూపర్ హిట్ సాంగ్ను రీమిక్స్ చేస్తున్నారని.. ‘అన్నయ్య’ సినిమాలో సూపర్ హిట్ సాంగ్గా నిలిచిన ‘ఆట కావాలా పాట కావాలా’ పాటను సరికొత్తగా రీమిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పాటను కంపోజ్ చేసే బాధ్యత భీమ్స్ సిసిరోలియోకు అప్పగించారని తెలుస్తోంది. దీంతో ఈ పాటను ఆయన సారథ్యంలో కంపోజ్ కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ పాటలో చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతోందని చిత్ర వర్గాల టాక్. ఈ సినిమాను పూర్తి సోషియో ఫాంటసీ సినిమాగా మేకర్స్ రూపొందిస్తుండగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
- July 10, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor

