‘కిష్కింధపురి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

‘కిష్కింధపురి’  రిలీజ్ డేట్ ఫిక్స్..?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన తాజా సినిమా ‘కిష్కింధపురి’. హర్రర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ టీజర్‌ రూపంలోనే మంచి బజ్‌ క్రియేట్ చేసుకుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్షసుడు తర్వాత మరోసారి బెల్లంకొండ – అనుపమ జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘కిష్కింధపురి’ కథ 1989 కాలంలో, ఒక పాత బంగ్లా భవనం ‘సువర్ణమాయ’ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ చిన్మయ్ సలాస్కర్ అందిస్తున్నారు. టీజర్‌, ట్రైల‌ర్‌ చూస్తేనే విజువల్స్, బేక్ గ్రౌండ్ స్కోర్ అత్యుత్తమంగా ఉన్నాయనే అభిప్రాయం నెటిజన్లలో క‌లుగుతోంది. హర్రర్ సినిమాల్లో కీలకమయ్యే భయానక వాతావరణాన్ని వారు ఎంతో బలంగా ప్రెజెంట్ చేశారు. ‘అల్లుడుశీను’తో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ కెరీర్ లో ‘రాక్షసుడు’ ఒక మంచి హిట్టుగా నిలవగా, బాలీవుడ్ లో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ ఘోర విఫలమైంది. అదే సమయంలో ఇటీవల విడుదలైన మల్టీ స్టారర్ ‘భైరవం’ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడీ ‘కిష్కింధపురి’ సినిమాతో పక్కా హిట్ అందుకోనున్నాడని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రేక్షకుల కంటికి కొత్తగా కనిపించే హర్రర్ థ్రిల్లర్ గా ఇది నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

editor

Related Articles