బాహుబ‌లి రీ-రిలీజ్‌కి రెడీ..

బాహుబ‌లి రీ-రిలీజ్‌కి రెడీ..

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబ‌లి సినిమా మ‌ళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విష‌యం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో రెండు భాగాల‌ను ఒకే పార్టుగా అక్టోబ‌ర్ 31న‌ రీ రిలీజ్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్. అయితే ఈ సినిమా నుండి తాజాగా మేక‌ర్స్ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాను కేవలం రీ-రిలీజ్‌గా కాకుండా, సరికొత్త అనుభూతినిచ్చేలా మెరుగైన సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను ఐమాక్స్ (IMAX) తో పాటు, 4DX, డాల్బీ సినిమా వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదల చేయనున్నారు. రీమాస్టర్డ్ పిక్చర్, సౌండ్ క్వాలిటీతో ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వబోతోంది. మ‌రోవైపు ఈ సింగిల్ వెర్షన్ సినిమా నిడివి దాదాపు 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేయ‌గా ఇటీవ‌లే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక పదేళ్ల తర్వాత బాహుబలి మాయాజాలాన్ని బిగ్ స్క్రీన్‌పై ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

editor

Related Articles